నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండలం పాత దాంరాజ్ పల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు గ్రామ సర్పంచ్ రోండ్ల రాజేశ్వరి రాజారెడ్డి అంబలి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా, ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీలను వడదెబ్బ నుంచి రక్షించేందుకు పలుచోట్ల ఉచితంగా వారం రోజుల పాటు అంబలి పంపిణీ చేస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రోండ్ల రాజేశ్వరి రాజారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ ఏగ్యారపు నరేష్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

