Thursday, April 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకార్మిక హక్కుల సాధనకై సుతారి రాములు పిలుపు

కార్మిక హక్కుల సాధనకై సుతారి రాములు పిలుపు

📰 Generate e-Paper Clip

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో ‘మేడే’ ఉత్సవాలు వర్ధిల్లాలి అని కార్యక్రమం చేపట్టారు.అనంతరం జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు సుతారి రాములు మాట్లాడుతూ, ప్రపంచ కార్మిక దినోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదని, కార్మికుల ఎనిమిది గంటల పనిదినం మరియు హక్కుల కోసం జరిగిన పోరాట స్ఫూర్తి అని కొనియాడారు.ప్రస్తుత తరుణంలో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని, కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. హమాలీ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని మరియు కార్మిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ, ‘మే డే వర్ధిల్లాలి’, ‘కార్మిక ఐక్యత జిందాబాద్’ అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు , కార్మికులు చిత్తరి రవి , కొండం రమేష్ , రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular