నవగీతం వేల్పూర్ ప్రతినిది:
వేల్పూర్ మండలంలో శుక్రవారం దేవి గుడి ఆవరణలో నిర్మిస్తున్న గదుల నిర్మాణానికి గ్రామానికి చెందిన బద్ధం రాజేశ్వర్ తమ వంతుగా రూ. 50000/- రూపాయలు విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా వేల్పూర్ గ్రామభివృద్ధికమిటీ , దేవాలయ కమిటీ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తు బద్దం రాజేశ్వర్ కి శాలువా తో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి ప్రముఖులు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని విరివిగా విరాళాలు అందజేయాలని కోరారు.

