నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:
మెట్ పల్లి పట్టణంలో 25వ వార్డులో గల జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు మొదటి శ్రేణి ఇబ్రహీం 529,రెండవ శ్రేణి రాకేష్ 511 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 వార్డు కౌన్సిలర్ అస్ర ఫర్హీన్ జావిద్ సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు ఏనుగంటి నర్సయ్య ఉత్తమ పేరెంట్స్ ఉస్మాన్ కి సన్మానించినారు అదే విధంగా పాఠశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ అస్ర ఫర్హీన్ జావిద్ ,ప్రధాన ఉపాధ్యాయులు ఏనుగంటి నరసయ్య ఉపాధ్యాయులు భూమేశ్వర్. నంబి రాజేంద్ర శర్మ. విజయ్ కుమార్. మనోజ్ కుమార్. బండి సుధాకర్. వాసాల శేషు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


