Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాల25వ వార్డులో డ్రైనేజ్ సమస్యపై కౌన్సిలర్ స్పందన

25వ వార్డులో డ్రైనేజ్ సమస్యపై కౌన్సిలర్ స్పందన

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి :

పట్టణంలోని 25వ వార్డులో భవాని శీనన్న ఇంటి సమీపంలో డ్రైనేజ్ మూసుకుపోవడంతో మురుగు నీరు రోడ్డుపైకి వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ అస్ర ఫర్హీన్ జావిద్ వెంటనే స్పందించారు. సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మున్సిపల్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైనేజ్ సమస్య కారణంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున వెంటనే క్లియర్ చేసి శాశ్వత పరిష్కారం చూపాలని కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బందిని కోరారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ అస్ర ఫర్హీన్ జావిద్, మున్సిపల్ సిబ్బంది సృజన్, భవాని శీను, అబ్దుల్ బారి, మేర రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular