నవగీతం,హైదరాబాద్:
ఈనెల 23వ తేదీన యాదగిరి గుట్ట (యాదాద్రి)శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ వేద పాఠశాల, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన మహోత్సవానికి రావాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ఆహ్వాన పత్రికను బుధవారం హైదరాబాద్ లో ఆలయ అధికారులు అందజేశారు.యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో వేద పాఠశాలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కి ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు.

