నవ గీతం, భీమ్ గల్
మనోహరాబాద్ మెదక్ జిల్లాలోఈనెల 27 నుండి 29 వరకుజరిగిన 10వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్ బాల్ బాలుర ఛాంపియన్షిప్ పోటీలలోజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముచ్కూర్ క్రీడాకారుడు నర్మల మనువర్ధన్ పాల్గొని జట్టు విజయానికి కృషి చేసి బంగారు పతకాలు అందుకున్నారని వ్యాయమ ఉపాధ్యాయురాలు ఎం సుజాత తెలిపారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ మర్కంటి గంగ మోహన్ మరియు మన నిజామాబాద్ జిల్లా కోచ్ లు అనికేత్ నరేశులు పాల్గొన్నారుఈ సందర్భంగా క్రీడాకారున్ని గ్రామ సర్పంచ్ కోడిగేలా శ్రీనివాస్ వార్డు సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆరే రమేష్ ఉపాధ్యాయ బృందం అభినందించారు.

