నవగీతం, మెట్ పల్లి
మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేల్ముల శ్రీనివాస్ రావు సమక్షంలో చలికాలం దృశ్య బిక్షడన చేస్తు రోడ్లపై పడుకున్న నిరుపేదలకు 25 మందికి దుప్పట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేల్ముల శ్రీనివాసరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మెట్ పల్లి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము రాత్రిపూట రోడ్లపై పడుకున్న పేదలకు భిక్షటన చేస్తున్న వారికి చెద్దర్లు పంపిణీ చేయడం జరుగుతుందని లయన్స్ క్లబ్ పేదలకు సేవ చేయడమే కార్యక్రమంగా ముందుకు సాగుతుందని లయన్స్ క్లబ్ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో దొంతుల ఆంజనేయులు మరియు ఇల్లెందుల శ్రీనివాస్, మర్రి భాస్కర్ పాల్గొన్నారు.

