నవగీతం, మల్లాపూర్
తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాబాట అనే కార్యక్రమంతో వార్డులలో ఉన్నటువంటి పలు కరెంటు సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించవచ్చని సర్పంచ్ గోల్కొండ కళ రమేష్ అన్నారు. గ్రామం లో చెడిపోయినటువంటి కరెంటు స్తంభాలు ,ఇందిరామ్మ ఇండ్ల పక్కన ఉన్న కరంటు లైన్, ఓవర్ లోడ్ ట్రాన్సఫర్ లు ఇంటి పైనుండి ఉన్న లైన్స్ ఎస్టీ తండాలో ఉన్న లైన్స్ తనిఖీ చేసిన పలు కరెంటు సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోల్కొండ కళ రమేష్ ఉపసర్పంచ్ దండవేణి రాజేందర్ వార్డు మెంబెర్స్ విద్యుత్ సిబ్బంది ఏ ఈ శివ కుమార్ సబ్ ఇంజనీర్ అలీ ఏ యల్ యం విష్ణు ఉన్నారు

