వైరా ఇంచార్జ్ ఏసిపి వసుంధర యాదవ్
నవగీతం,వైరా
సంక్రాంతి పండగ సందర్భంగా కోడిపందాలు పేకాట జూదం వంటి అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వైరా ఇన్చార్జ్ ఏసిపి వసుంధర యాదవ్ అన్నారు. సోమవారం ఏసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని పేకాట జూదం, కోడిపందాలు వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు ఆర్థికంగా నష్టపోవద్దని కోరారు.ఈ కార్యకలాపాలు జరిగిన సమాచారాన్ని ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

