నవగీతం,రుద్రంగి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని శ్రీ శంభులింగేశ్వర ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా దర్శనం గంగా మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా తాటికొండ శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం మానాల గ్రామంలో శ్రీ శంభులింగేశ్వర ట్రాక్టర్ యూనియన్ సభ్యులందరు కలిసి ప్రత్యేక సమావేశంలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో యూనియన్ పాలకవర్గం ఎన్నిక జరిగింది.ఈ సందర్భంగా దర్శనం గంగ మల్లయ్య మాట్లాడుతూ.. తను ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన సభ్యులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసరి అశోక్, రాష్ట్ర ఓ బిసి సేల్ అధ్యక్షుడు జక్కు వంశీ, వార్డు సభ్యులు సంద రాజం, లకవత్ బాలు, వర్ణం శ్రీనివాస్, దర్శనం గంగాధర్, తూము రమేష్, సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

