నవగీతం, మెట్ పల్లి టౌన్ :
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మెట్ పల్లి పట్టణంలో బుధవారం జరిగిన పోలింగ్ లో దివంగత మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకటరమణారెడ్డి (దాము) సోదరుడు తుమ్మల శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెట్ పల్లి మండల కార్యాలయంలో ఓటు వేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు గడ్డం రాజరెడ్డి, ఇల్లెందుల కృష్ణమాచారి, నాంపల్లి మారుతి, కొండ్లెపు శ్రీనివాస్, రాజారామ్ తదితరులు ఉన్నారు

