నవగీతం,మల్లాపూర్:
మల్లాపూర్ మండలం వేంపల్లి పురాతన శివాలయంలో వేంపల్లి గ్రామానికి చెందిన వేముల రాజశేఖర్ లాస్య దంపతుల కుమారి వేముల హర్షిత జన్మదిన సందర్భంగా సోమవారం పురాతన (చిన్న గుడి) శివాలయంలో వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సజ్జనాపు శ్రీనివాస్ వేముల దశ గౌడ్ వేముల నరేష్ గౌడ్, మోత్కూరి రాజేందర్ గౌడ్ ,ఆలయ కమిటి సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

