తాసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన కిసాన్ సంఘ్
నవగీతం, మల్లాపూర్:
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని రైతు భరోసా నిధులను రైతులకు పంపిణీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ మల్లాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మల్లాపూర్ తాసిల్దార్ శ్రీను కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాచారం భూమారెడ్డి మండల అధ్యక్షుడు కళ్లెం మైపాల్ రెడ్డి గ్రామ అధ్యక్షులు పోచంపల్లి చిన్న రమేష్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు చిట్యాల లక్ష్మణ్ మెరపు గంగరాజం సంగేపు అనిల్ రెడ్డి నల్ల అమరేందర్ కొప్పెల రాజశేఖర్ రెడ్డి ఎలాల శ్రీనివాస్ రెడ్డి పెద్దిరెడ్డి లక్ష్మణ్, సారుగు దేవయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

