నవగీతం, ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం మండలంలోని ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పూర్తి అదనపు బాధ్యతలను ఓదెల రామకృష్ణ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కోరుట్ల ప్రస్తుత ఎంపిడిఓ చిప్ప గణేష్ ఇవ్వడం జరిగింది. ఇది వరకు ఇక్కడ పని చేసిన ఎంపిడిఓ చిప్ప గణేష్ 45 రోజులు ట్రైనింగ్ కి వెళ్ళడం జరిగింది. కావున అదనపు బాధ్యతలను తీసుకున్న ఎంపిడిఓ రామకృష్ణకి కార్యాలయ సిబ్బంది శాలువతో సన్మానించి ఆహ్వానించడం జరిగింది. కార్యక్రమము లో సీనియర్ సహాయకులు లక్ష్మయ్య, ఏపీఎం. శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.

