Saturday, March 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలశ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సుజిత్ రావు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సుజిత్ రావు

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన ధ్వజస్తంభం నిర్మాణ కార్యక్రమానికి టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. వారితో పాటు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,మాజీ ఉప సర్పంచ్ ఎన్నెడ్ల రాములు, మాజీ విడిసి చైర్మన్ మహబూబ్ ఖాన్,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ అమ్ముల పవన్, ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లూరి సాగర్, కల్లెడ గంగాధర్,తోకల రాజు గంగపుత్ర సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular