నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి :
మెట్ పల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైత్రి ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు పాల్గొన్నారు. ఆసుపత్రికి వచ్చిన సందర్భంగా డాక్టర్ రఘుకు ఆసుపత్రి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ జేఎన్ వెంకట్, సునీత దేవి, నాయకులు చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, అల్లూరి మహేందర్ రెడ్డి, పల్లి శేఖర్ గౌడ్, దేవేందర్ గౌడ్, రాజన్న, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

