నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ నగర్ 1 అంగన్వాడి సెంటర్లో గర్భిణీలకు బాలింతలకు బరువు, రక్తపోటు, హిమోగ్లోబిన్, ఐఎఫ్ఏ, కాల్షియం మాత్రల గురించి బాలింతలకు ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని ఇతర పదార్థాలు ఇవ్వకూడదని తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ తెడ్డు శ్రీజ విజయ్, అంగన్వాడి టీచర్ శంకరమ్మ, ఏఎన్ఎం మధురిమ, ఆయమ్మ విజయ, ఆశ, మమత మరియు తల్లులు,గర్భిణీలు బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు

