జస్టిస్ రేణుక యారకు అరుదైన గౌరవం
నవగీతం కోరుట్ల ప్రతినిధి
కోరుట్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుక యార విచ్చేసి, కోర్టును ప్రారంభించారు.ఈ సందర్భంగా కోరుట్లకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది చాప కిశోర్ స్వయంగా గీసిన జస్టిస్ రేణుక యార అద్భుత చిత్రపటాన్ని ఆమెకు బహుకరించారు. చిత్రపటాన్ని స్వీకరించిన జస్టిస్ రేణుక యార హర్షం వ్యక్తం చేస్తూ, న్యాయవాది కిశోర్ లోని సృజనాత్మకతను మరియు కళాభిమానాన్ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు న్యాయవాదులు పాల్గొని కిశోర్ ప్రతిభను కొనియాడారు.


