Saturday, March 7, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుయువతకి విద్యావంతులకి ప్రాధాన్యత - జనసేన నాయకులు ప్రేమ కుమార్

యువతకి విద్యావంతులకి ప్రాధాన్యత – జనసేన నాయకులు ప్రేమ కుమార్

📰 Generate e-Paper Clip

నవగీతం,గద్వాల్

జనసేన పార్టీ రాష్ట్ర యువజన అడ్ హాక్ కమిటీ సభ్యులు మహబూబ్, జమ్మన్న, సిద్ధురాములరెడ్డి ఆధ్వర్యంలో గద్వాల్ నియోజకవర్గంలో జన సైనికులతో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల కో- ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో గద్వాల్, ఐజా, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీ నుండి సుమారు యాభై ఎనిమిది మంది యువత వివిధ పార్టీల నుండి పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరటం జరిగింది, వారిలో కొందరు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ కౌన్సిలర్ గా సంసిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రేమకుమార్ మాట్లాడుతూ పార్టీని బలంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని జనసేన పార్టీలో యువతకు, విద్యావంతులకు, ప్రాధాన్యత ఉంటుంది అని, నిత్యము ప్రజలలో సేవాదృక్పథంతో మరియు జాతీయభావముతో సేవ చేసుకుంటూ ఉండాలని గద్వాల్ మున్సిపాలిటీలో జనసేన జెండా ఎగరవేస్తాము అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గద్వాల్ నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular