నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:
మెట్పల్లి పట్టణంలో స్థానిక ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ కార్యాలయంలో బిజినెస్ సమావేశంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఘనంగా సన్మానించారు. సంస్థ డిఅర్ఎం, బ్రాంచ్ మేనేజర్ , సేల్స్ మేనేజర్ అరవింద్ సమక్షంలో సిబ్బందిని శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. సంస్థ వృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు.

