నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
ముందస్తు బడిబాట కార్యక్రమంలో భాగంగా కథలాపూర్ మండలం సిరికొండ కాంప్లెక్స్ పరిధిలోని సిరికొండ, బొమ్మన, తక్కలపల్లి గ్రామాల ఉపాధ్యాయ బృందం అందరూ పాల్గొని విద్యార్థుల ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క సౌకర్యాలు ఉచిత భోజనము, ఉచిత పుస్తకాలు యూనిఫామ్ వివిధ సదుపాయాలు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి లోకిని శ్రీనివాస్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీనరసయ్య ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మహేష్, జయలక్ష్మి, ముఖ్యఅతిథి రాంప్రసాద్ సర్పంచ్ భూపెల్లి రాజా గంగారం ఉపసర్పంచ్ గంగాధర్ ఉపాధ్యాయులు మహేందర్, రమేష్, ప్రసన్న దీప్తి మేడం గంగాధర్ ఖలీల్ భాయ్, రాజశేఖర్ , సత్యనారాయణ సార్, ప్రశాంత్ రమేష్ శెట్టి, వెంకటేష్ , భవాని శ్రావణి నుజాహత్ అంగన్వాడి టీచర్లు రజిత, అనూష, రాణి లక్ష్మి, పద్మాంజలి తదితరులు పాల్గొన్నారు.


