బీసీ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ
నవగీతం,మల్లాపూర్:
మల్లాపూర్ మండలం మొగిలిపేట ప్రమాదంలో చనిపోయిన కూలీలకు రూ.20 లక్షలు ప్రభుత్వ సహాయం గా మానవత దృక్పథంతో సహాయం చేయాలి అలాగే గాయపడిన వారికి రూ.5 లక్షల సహాయం చేసి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరుట్ల ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కొమిరెడ్డి కరం చంద్ కి కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పక్షాన బాదతాప్తా హృదయంతో తెలుపుతున్నాను. ఈ ప్రమాదం తీవ్రమైన ప్రమాదంగా గుర్తించి రేక్కాడితే గాని డొక్కా డొక్కాడని కూలీల కుటుంబాలకు భరోసానివ్వాలి వ్యవసాయ కూలీల మృత్యువాతగా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వీరిని గుర్తించి మానవతా హృదయంతో ఆర్థిక సహాయం అందివ్వాలని మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు అండగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరారు

