Wednesday, March 11, 2026
ads
Homeతెలంగాణకరీంనగర్పరీక్ష ప్యాడ్స్ పెన్నులు పంపిణీ

పరీక్ష ప్యాడ్స్ పెన్నులు పంపిణీ

📰 Generate e-Paper Clip

నవగీతం, కరీంనగర్:

బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025–26 SSC బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మిడిదొడ్డి కపిల్ మాధవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు రాబోయే పరీక్షల కోసం అవసరమైన పెన్నులు, పెన్సిల్స్, ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం కపిల్ మాధవ మాడ్లాడుతూ విద్యార్థులు ఎస్ఎస్సి  బోర్డు పరీక్షల్లో మంచి ఉన్నత మార్కులు సాధించాలని, పాఠశాల నుండి వంద శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులను అందచేస్తామని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 6 వ డివిజన్ కార్పొరేటర్ యం. వెంకటేష్,మాజీ సర్పంచ్ పి. శ్రీనివాస్ పాఠశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular