నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
మల్యాల మండల కేంద్రంలోని కొత్తపేట వద్ద గురువారం మధ్యాహ్నం కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రత కారణంగానే మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని అప్రమత్తంగా చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని వార్డు సభ్యులు మల్యాల గణేశ్ వెల్లడించారు.

