Thursday, September 17, 2026
ads
Homeఎడిటోరియల్డాక్టర్ రఘు కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

డాక్టర్ రఘు కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

📰 Generate e-Paper Clip

మెట్‌పల్లి,సెప్టెంబర్16,(నవగీతం)

కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్‌ఛార్జి డాక్టర్ రఘు కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఇటీవల డాక్టర్ రఘు తల్లి పుష్పలత మృతి చెందడంతో జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని వారి నివాసానికి బుధవారం ఆమె వెళ్లారు.

ఈ సందర్భంగా పుష్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించిన కవిత, డాక్టర్ రఘు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పుష్పలత ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పునుగోటి పవన్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular