నవగీతం, జగిత్యాల:
సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలోని శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు తాటిపర్తి సీకే రెడ్డి కూడా పాల్గొన్నారు. సర్పంచులు రమేశ్, బుక్య భారతి చిరంజీవి, మాజీ సర్పంచ్ అజ్మీరా శ్రీలత శ్రీనివాస్, తేలు రాజు, కొలువుల రమణ, రాంచంద్ర రెడ్డి, ప్రసాద్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బేర మహేశ్, నర్సింహా రెడ్డి, ఆనంద్ రెడ్డి, జగన్, మల్లేశం, సతీష్ గౌడ్, రవి, రాయమల్లు, గంగమల్లు, పురుషోత్తం, మదన్, బాస మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
