Wednesday, August 5, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలస్కూల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి

స్కూల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

మొన్న గుడి -నేడు బడి

నవగీతం,మెట్ పల్లి:

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఉద్రిక్తత నెలకొంది.పదిహేను రోజుల క్రితం కొత్త బస్టాండ్ ఆవరణలో హనుమాన్ గుడికి కడుతున్న గద్దెను కూల్చారు. నేడు హనుమాన్ మాలలో ఉన్న విద్యార్థులను స్కూల్ లోనికి అనుమతించక పోవడంతో నిఖిల్‌ భారత్‌ స్కూల్‌ దగ్గర హనుమాన్‌ స్వాముల ధర్నా నిర్వహించారు. హనుమాన్‌ మాలలో ఉన్నందుకు ఐదుగురు విద్యార్థులను పాఠశాల లోపలికి అనుమతించలేదని ఆరోపించారు.

పాఠశాల యాజమాన్యంపై హనుమాన్‌ భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి హనుమాన్‌ స్వాముల నిరసన తెలిపారు. సనాతన ధర్మాన్ని కించ పరిస్తే ఊరుకునేది లేదని జనసేన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమం లో బండి రమాదేవి, ఎలగందుల అజయ్, ఆబ్బురి ఆనంద్ గౌడ్, మ్యాడారపు మారుతి, వన్నెల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular