నవగీతం,రుద్రంగి
మాఘ మాస అమావాస్య సందర్భంగా సిరిసిల్ల జిల్లా కొనరావుపెట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి వారిని ఉమ్మడి చందుర్తి, రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. వేద పండితులు మార్కెట్ చైర్మన్ ను ఆశీర్వదించారు. స్థానిక సర్పంచ్ లక్ష్మారెడ్డి ఆలయ కమిటీ మరియు ఆలయ కమిటీ సభ్యులు శాలువతో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చేలుకల తిరుపతి మాట్లాడుతూ ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని వేడుకున్నట్టు తెలిపారు. ఆయన వెంట కూర్మాచలం సత్యనారాయణ, ఆకుల గంగాధర్, పెద్ది రవి, గసికంటి అరుణ్ తదితరులు ఉన్నారు.

