నవగీతం,మల్లాపూర్:
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ హుటాహుటిన మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.ఈ ఘటన పట్ల ఎమ్మెల్యే తీవ్ర విచారం వ్యక్తం చేశారు.గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు బాధిత కుటుంబాలను ఓదార్చారు.

