నవగీతం, మెట్ పల్లి:
మెట్ పల్లి మున్సిపాలిటీకి కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ని ఐరిస్ గ్లోబల్ హై స్కూల్ యాజమాన్యం బుధవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా చైర్మన్ కి పుష్పగుచ్చం అందజేసి, వారి చిత్రపటాన్ని వారికి బహుకరించి శాలువాతో సత్కరించారు. పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని, విద్యా రంగానికి మరింత ప్రోత్సాహం అందించాలని యాజమాన్యం ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో యాజమాన్య బృంద సభ్యులు గంగుల మౌనిక – సురేష్, గంగుల లక్ష్మి – ప్రసాద్, గంగుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

