నవగీతం,మల్లాపూర్:
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర త్రికుట ఆలయ నూతన కమిటీని అన్ని కులాల సంఘ సభ్యుల సమన్వయతో వారి యొక్క కుల సభ్యులందరూ కలిసి,గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని కులాల సభ్యులందరినీ ఆలయ కమిటీ సభ్యులుగా తీసుకొని శ్రీ రామలింగేశ్వర త్రికుట ఆలయ కమిటీ చైర్మన్ గా పందిరి నాగరాజు ని ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్లుగా సభవత్ బిక్య నాయక్, బొర్రగళ్ల రవి, కొప్పుల నర్సయ్య, ప్రధాన కార్యదర్శులుగా చిన్న జమల్, గడ్డం మహీందర్, కోశాధికారిగా బండి రాజు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బొల్లారపుమురళి, కార్యదర్శులుగాపడకంటి వెంకటేష్ , పాతర్ల రఘు నుఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

