నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన సమిండ్ల వాణి – శ్రీనివాస్ మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ .సంజయ్ కుమార్, జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పుష్పగుచ్ఛం అందించగా సిఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నరసింగరావు ఉన్నారు.

