నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
గోవధ చట్టం 1977 ప్రకారం చర్యలు తీసుకోవాలని జగిత్యాల హిందూ ఐక్య వేదిక డిమాండ్ చేసారు. తెలంగాణలో గోవధ పై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల హిందూ ఐక్యవేదిక ద్వారా పెద్ద ఎత్తున అన్ని కులాల సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా హిందు వాహిని సభ్యులు వేముల సంతోష్, కైలాష్ పతి, హరీష్, మహేష్, వెంకటేష్, దశరథం, నగేష్, రాజేందర్, వంజరి సంఘం నుండి ఆంజనేయులు పద్మశాలి సేవా సంఘం నుంచి బోగ గంగాధర్, గట్ల ప్రతాప్, మురళి, మునిందర్, వీరబత్తిని అనిల్, శ్రీనివాస్, నరేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు..

