కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి పరామర్శ
నవగీతం, జగిత్యాల:
చరిత్ర కారుడిగా వేలాది మంది కి దిక్సూచిగా నిలిచిన జైశెట్టి రమణయ్య కుటుంబ సభ్యులను మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రమర్శించారు. రమణయ్య తో తన అనుబంధాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. రమణయ్య భౌతికంగా దూరమైన ఆయన వెలికి తీసిన చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది.నిత్యం నూతన అంశాలు నేర్చుకుంటూ జీవితమంతా విద్యార్థిగా ఉన్నారని అన్నారు.రమణయ్య క్రమశిక్షణ, సమాజ హితం కోసం తాపత్రయపడే తత్వం అందరికీ ఆదర్శప్రాయం. ఉపాధ్యాయుడిగా, చరిత్ర కారుడిగా వేలాది మంది కి దిక్సూచిగా నిలిచారని,ఆయన సేవలను స్మరించారు.

