జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము
నవగీతం, మల్లాపూర్:
విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసేవే టాలెంట్ టెస్ట్ లని జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము అన్నారు. మంగళవారం మెట్ పల్లి పట్టణంలో నిర్వహించిన డివిజన్ స్థాయి తెలుగు టాలెంట్ టెస్ట్ కి ఆయన హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ పోటీల్లో మల్లాపూర్ మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి బెజ్జారపు సాహితీ ద్వితీయ స్థానంలో నిలవడం పట్ల ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఎంఈఓ దామోదర్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భూమేష్, తెలుగు అధ్యాపకురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు.


