నవగీతం,వేల్పూర్ ప్రతినిధి :
వేల్పూర్ గ్రామానికి చెందిన ఆకుల సుశాంత్ కి రోడ్ యాక్సిడెంట్ జరగడం వలన బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకొని చేయూత ఫౌండేషన్ వేల్పూర్ వారు ఆర్థిక సహాయంగా రూ.10000 పదివేలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు జెల్ల ప్రవీణ్ సభ్యులు మల్లికార్జున్ బాల శంకర్ హితీష్ దినేష్ కార్తీక్ మైపాల్ శ్రీను మహేష్ పాల్గొన్నారు.

