నవగీతం, వేల్పూర్ ప్రతినిధి:
స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అని వేల్పూర్ వి.డి.సి అధ్యక్షులు బైరి రమేష్, గ్రామ సర్పంచ్ మొండి అశోక్ అన్నారు. గురువారం ఇజ్రాయెల్ వేల్పూర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వేల్పూర్ వెంకటాపూరం రోడ్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … మన గ్రామం నుండి ఇజ్రాయిల్ వలస వెళ్లి అక్కడ కాయకష్టం చేస్తూ జీవిస్తూ మన పుట్టిన గడ్డకు సహాయ సహకారాలు అందించాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇజ్రాయిల్ ఫౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమలు నిర్వహిస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులకు పేరు పేరునా ప్రత్యేకా ధన్యవాదములు, తెలిపారు ఈ కార్యక్రమంలో వేల్పూర్ యువత పాల్గొన్నారు.


