నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండల కేంద్రంలో గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యం తో మరణించిన పెద్దిరెడ్డి చిన్న ఎల్లయ్య కుటుంబ సభ్యులను మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, పాలక వర్గం సభ్యులు పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.విరితో వార్డు సభ్యులు ముష్కరి రమేష్,భుక్యా శేఖర్, ముత్యాల గంగా రాజం,అల్లె చంద్రయ్య,నల్ల రాజేశ్వర్,ఉయ్యాల లక్ష్మణ్,శివరాత్రి నర్సయ్య, బోదాసు నర్సారెడ్డి,తొట్ల భూమ రెడ్డి,సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

