నవగీతం, చొప్పదండి :
చొప్పదండి మండలంలోని కాట్నపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ గన్ను శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ పెరుమాండ్ల మానస గంగయ్య, పట్టణ అధ్యక్షుడు నిజానపురం చందు, నాయకులు గాజంగి రాములు, చుప్ప శ్రీనివాస్, కట్టేకోల లక్ష్మణ్, కట్టేకోల శ్రీనివాస్, పెరుక శ్రీనివాస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


