నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు భరత మాత కూడలి వద్ద సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు పెద్ద ఎత్తున నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమం కు ప్రజలు భారీ సంఖ్య లో హాజరు కాగలరని మల్లాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ గ్రామస్థులను ఆహ్వానించారు. మహిళలు మంగళ హారతులతో కార్యక్రమం కు రావాలని కోరారు.భారీ సంఖ్య లో మల్లాపూర్ ప్రజలు హాజరు అయ్యి ఈ హిందూ సమ్మేళనం విజయవంతం చేయగలరని కోరారు. కార్యక్రమం లో 2 వ వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి ఉయ్యాల లక్ష్మణ్,మకిలి రాకేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

