నవగీతం, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్ గారిని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో చైర్మన్ మెట్టు సాయికుమార్ డీజీపీ సీవీ ఆనంద్కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు సాధారణ విషయాలపై వారు కాసేపు చర్చించారు. డీజీపీ సీవీ ఆనంద్కు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పుష్పగుచ్ఛం అందజేశారు. ఇరు విభాగాల ప్రముఖుల మధ్య జరిగిన ఈ సమావేశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ముజాఫర్ తదితరులు పాల్గొన్నారు.

