నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ బృందం ఎస్సి, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారిని మంగళవారం రోజున జగిత్యాలలో కలిసి శాతవాహన యూనివర్సిటీలో చరిత్ర మరియు టూరిజం కోర్సును ప్రవేశపెట్టాలని, అలాగే ఇంటర్మీడియట్ లో హెచ్.సి.ఈ.సి. అనే నూతన కోర్సు ప్రవేశపెట్టాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించి సామాజిక శాస్త్రాలకు తల్లి అయిన చరిత్ర సబ్జెక్టును పరిరక్షించుటకు శాతవాహన యూనివర్సిటీలో చరిత్ర మరియు టూరిజం డిపార్ట్మెంట్ పెట్టుటకు, ఇంటర్మీడియట్ లో హెచ్.సి.ఈ.సి. కోర్సు ప్రవేశ పెట్టుటకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారని రాష్ట్ర కమిటీ సభ్యులు తెలిపారు.చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా కృషి చేస్తున్న చరిత్ర పరిరక్షణ సమితి సభ్యులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. పోతరవేణి తిరుపతి, వ్యవస్థాపకులు డాక్టర్ సందెవేణి తిరుపతి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కుందారపు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

