నవగీతం, జగిత్యాల/ధర్మపురి:
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన పాల రాజేశం ఇటీవల మరణించగా బాధిత కుటుంబాన్ని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం పరామర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. కార్యక్రమంలో నేరెళ్ల సర్పంచ్ బాల గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

