Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లకల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.

📰 Generate e-Paper Clip

నవగీతం,ఇల్లంతకుంట ప్రతినిధి:

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సాయి మణికంఠ ఫంక్షన్ హాల్‌లో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాస్థాయి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించగా, అనంతరం ఇల్లంతకుంట మండలానికి చెందిన లబ్ధిదారులు గడ్డం మాధురి, మచ్చ పద్మలకు కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను అతిథులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముస్కానిపేట సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇల్లంతకుంట సర్పంచ్ ఎం.రాజు, వెల్జిపూర్ సర్పంచ్ నాయిని నవీన్ కుమార్, రంగపేట సర్పంచ్ మేడిపెల్లి భాస్కర్ రెడ్డి, తాళ్లపెల్లి ఉపసర్పంచ్ ఎలుక రామస్వామి, వార్డు సభ్యులు రాకం సుమన్, అంతటి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular