నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల నియోజకవర్గ జగిత్యాల, రాయికల్ పట్టణ కౌన్సిలర్లు సోమవారం నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతో కలిసి హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్, రాయికల్ పట్టణ అధ్యక్షుడు కుర్మా మల్లారెడ్డి, కౌన్సిలర్లు కల్లెడ ధర్మపురి, వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, కొక్కు అనిత, సిరిపురం శ్రీలత – శ్రీనివాస్, గట్టి పెళ్లి జ్ఞానేశ్వర్, కునారపు మానస -భూమేశ్, తోపారపు ప్రశాంతి – సురేశ్, పుర్రె శ్రీధర్, వేముల మౌనిక – రాము తదితరులు పాల్గొన్నారు

