నవగీతం మెట్పల్లి:
మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో జరుగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ పరిశీలించారు. వార్డులో పరిశుభ్రత మెరుగుపర్చేందుకు చేపట్టిన చర్యలను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదరాన్ని తొలగించే పనులను వేగవంతం చేయాలని సూచించారు.మురికి కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పారిశుధ్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. చెత్త నిల్వ ఉండకుండా నిరంతరం శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్షాకాలం ముందు డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా ఉంచడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని కోరారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పట్టణం శుభ్రంగా ఉండేందుకు అందరూ కలిసి కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పారిశుధ్య సిబ్బంది పాల్గొని శుభ్రత పనులను నిర్వహించారు.

