Sunday, September 20, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమున్సిపల్ చైర్మన్ కు బీజేపీ కౌన్సిలర్ల ఘన సన్మానం

మున్సిపల్ చైర్మన్ కు బీజేపీ కౌన్సిలర్ల ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి టౌన్ :

మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రిని బీజేపీ టికెట్ పై పోటీ చేసి ఘన విజయం సాధించిన కౌన్సిలర్లు సన్మానించారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో చైర్మన్ మైలారపు లింబాద్రిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. మెట్ పల్లి మున్సిపల్ ను పార్టీలకు అతీతంగా అన్ని రంగాల్లో కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు బొడ్ల రమేష్, బొడ్ల ఆనంద్, అరిగెల అనూష రాకేష్, దొనికెల శిరీష నవీన్, కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్, ధర్మపురి స్వరూప వేణు, పుడుకారం దివ్యారెడ్డి కిషోర్, అరిసె వనజ మురళీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular