నవగీతం,జగిత్యాల:
జగిత్యాల మున్సిపల్ కు జరుగుతున్న ఎన్నికలలో నామినేషన్ ప్రక్రియ లో భాగంగా పట్టణంలో పలు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి పలు పార్టీల అభ్యర్థులు ముహూర్త బలంతో నామినేషన్ వేయడానికి మంది మార్బలంతో బల నిరూపణతో తరలి వెళ్తున్నారు.

ఇందులో భాగంగా 19వ వార్డుకు చెందిన బి.ఆర్ఎస్ అభ్యర్థి తుమ్మనపల్లి భారతి ,సంతోష్ గురువారం సుమారు 300మంది మహిళలతో ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కాలేజ్ నుండి హనుమాన్ వాడ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు కాగా వీరి ప్రచార శైలిని పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

