నవగీతం,జగిత్యాల
జగిత్యాల పట్టణంలోని మేరు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి పాల్గొని ముగ్గులను పరిశీలించారు. అనంతరం ప్రతిభ చాటిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సాంబరి కళావతి, సింగం పద్మ, పిండేరు భానుప్రియ, మేరు సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు

